ప్రస్తుతం సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్, ఆర్జీవి, కాస్టింగ్ కౌచ్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తోంది. తనపై, తన తల్లిపై చేసిన అభ్యంతరకరమైన విమర్శలకు వ్యతిరేకంగా పోరాటానికి కూడ దిగారు పవన్. అందులో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తానంటూ పలు మీడియా ఛానెళ్లపై ట్విట్టర్ ద్వారా కౌంటర్ అటాక్ కు దిగిన ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో అభిమానులు హైదరాబాద్ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకున్నారు.
దీంతో పవన్ కార్యాలయం నుండి బయటికొచ్చి అభిమానులంతా ప్రశాంతంగా ఉండి సంయమనం పాటించాలని కోరారు. అలాగే టీవీ ఛానెళ్లు, కొందరు వ్యక్తులు 8 నెలలుగా తనను తిడుతూ, చివరికి తన తల్లిని కూడ వివాదంలోకి లాగి, కోపం తెప్పిస్తూ నిగ్రహంగా ఉండాలని చెబుతున్నారని, నిన్న ఛాంబర్ వద్ద అరెస్టైన అభిమానుల తప్పేముందని, దీన్ని ప్రేరేపించే వ్యక్తులపై సుదీర్ఘమైన న్యాయపోరాటం చేస్తానని, కాబట్టి అభిమానులు కూడ కోపం తెచ్చుకోకుండా ఉండాలని అన్నారు.
మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడ ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై విచారణ నిర్వహించేందుకు పలువురు సినీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్నారు.