మరోసారి దర్శకత్వం చేయనున్న ‘పెళ్లి చూపులు’ నిర్మాత

మరోసారి దర్శకత్వం చేయనున్న ‘పెళ్లి చూపులు’ నిర్మాత

Published on Jul 25, 2016 1:37 PM IST

Raj-Kandukuri

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ‘పెళ్లి చూపులు’ అనే సినిమా గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. విజయ్ దేవరకొండ, రీతూ వర్మ జంటగా కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే టెస్ట్ స్క్రీనింగ్ జరుపుకోగా సినిమా చాలా బాగుందనే టాక్ వస్తోంది. అలాగే ఈ సినిమాకు నిర్మాతయిన ‘రాజ్ కందుకూరి’ గురించిన ఓ ఆసక్తికర విషయం కూడా తెలుస్తోంది. అదేమంటే ఈయన త్వరలో ఓ సినిమాని డైరెక్ట్ చేయనున్నారట.

స్వతహాగా వ్యాపార రంగంలో ఉన్న ఈయన సినిమాలపట్ల ప్యాషన్ తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. గతంలో ‘గోల శీను’ చిత్రానికి దర్శకత్వం వహించి ‘హృదయ కాలేయం’ చిత్రంతో డిస్ట్రిబ్యూటర్ గా కూడా మారి మళ్ళీ ఇప్పుడు మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం సప్టెంబర్ నుండి మొదలవుతుందని, ఇందులో అప్ కమింగ్ హీరోలైన సందీప్ కిషన్, నిఖిల్ వంటి హీరోల్లో ఎవరో ఒకరు నటించే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రంపై మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు