విజయవాడలో ‘పెళ్ళి చూపులు’ స్పెషల్ ప్రివ్యూ!

విజయవాడలో ‘పెళ్ళి చూపులు’ స్పెషల్ ప్రివ్యూ!

Published on Jul 25, 2016 5:48 PM IST

Pellichoopulu
‘పెళ్ళి చూపులు’.. గత కొద్దిరోజులుగా ఈ చిన్న సినిమా తెలుగు సినీ పరిశ్రమలో బాగా వార్తల్లో నిలుస్తోంది. విజయ్ దేవర కొండ, రీతూ వర్మ జంటగా నటించగా, కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు బయలుదేరాయి. ట్రైలర్ కూడా రిఫ్రెషింగ్‍గా ఉండడంతో ఆ అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇక ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే హైద్రాబాద్‌లో పలు ప్రివ్యూ షోస్ వేశారు.

ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకులు, హీరోలు ఈ ప్రివ్యూస్ చూసి సినిమాకు మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ ప్రివ్యూలతో వచ్చిన రెస్పాన్స్‌తో హ్యాపీ అయిన టీమ్, తాజాగా ఈ సాయంత్రం విజయవాడలో కూడా స్పెషల్ షో ఒకటి ఏర్పాటు చేసింది. విజయవాడకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా కొందరిని ఈ ప్రివ్యూకు ఎంపిక చేశారు. సినిమాపై తమకు పూర్తి నమ్మకం ఉందని, సినిమాను విడుదల లోపే ప్రేక్షకుల్లోకి మరింతగా తీసుకెళ్ళాలనే ఇలా ప్రివ్యూ షోస్ ప్రదర్శిస్తున్నామని నిర్మాతలు రాజ్ కందుకూరి, యస్ రాగినేని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు