‘పూజా హెగ్డే’ మీదే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట !

‘పూజా హెగ్డే’ మీదే దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారట !

Published on Mar 22, 2020 9:27 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా చెప్పుకునే పేరు ‘పూజా హెగ్డే’దే. ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది ఈ బ్యూటీ. పైగా ప్రెజెంట్ టాలీవుడ్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డేనే నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. పూజ ఖాతాలో వరుసగా ‘అరవింద సమేత, మహర్షి’, అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్స్ సినిమాలున్నాయి. దీంతో అమ్మడికి డిమాండ్ బాగా పెరిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్స్ అంతా పూజా వైపే చూస్తున్నారు. దీంతో పూజా రెమ్యూనరేషన్ రెట్టింపు చేసినట్టు తెలుస్తోంది. సుమారు సినిమాకి రూ.2.5 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అందుకే ఆమెకు ఈ మధ్య కాస్త ఆఫర్లు తగ్గాయి అని, అయినా పూజ మాత్రం డబ్బుల విషయంలో అసలు తగ్గట్లేదని.. ఏ మాత్రం మొహమాటం లేకుండా అంత ఇస్తేనే చేస్తానని డైరెక్ట్ గానే చెప్పేస్తుందట. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఫార్ములాను ఈ టాల్ బ్యూటీ పక్కాగా ఫాలో అవుతోందన్నమాట.

ఇకపోతే ప్రస్తుతం ఆమె చేతిలో ప్రభాస్ ‘జాన్’, అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ చిత్రాలున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమాలో కూడా పూజనే హీరోయిన్ అట. ఇవ్వన్నీ సూపర్
డూపర్ క్రేజ్ ఉన్న సినిమాలే. ఇవి గనుక హిట్టైతే రూ.2.5 కోట్లు కాస్త రూ.3 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఏమైనా పూజా హెగ్డేనే తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని దర్శకనిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు