బిజీ షెడ్యూల్ ని ముగించుకున్న పూజా హేగ్దే

బిజీ షెడ్యూల్ ని ముగించుకున్న పూజా హేగ్దే

Published on May 23, 2015 9:05 PM IST

Pooja-Hegde
దక్షిణాది భామలు బాలీవుడ్ లో పాగా వేయడం మనకు కొత్తేమి కాదు. ఇలియానా, తమన్నాల తరువాత ఇప్పుడు పూజ హేగ్దే ఆ బాటలో పయనించనుంది.

ఈ అందాల భామ అశుతోష్ గోవరికర్, హృతిక్ రోషన్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం పూజ గత మూడున్నర నెలలుగా కష్టపడుతున్న భుజ్ షెడ్యూల్ ని పూర్తిచేసుకుంది.

తన కెరీర్ లో అత్యంత బిజీగా సాగిన షెడ్యూల్ ఇదేనని తెలిపింది. మొహెంజొదారో అన్న టైటిల్ ని ఖరారు చేసినట్టు, ఈ చిత్రాన్ని 2016లో విడుదలచేయనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు