బాలీవుడ్ లో మంచి ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే

బాలీవుడ్ లో మంచి ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే

Published on Apr 25, 2018 6:23 PM IST

ఒక లైలా కోసం చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది నటి పూజ హెగ్డే. ఆచిత్రం మంచి విజయం సాధించడంతో ఆమెకు ఆఫర్లు బాగా వచ్చాయి. అల్లు అర్జున్ తో రీసెంట్ గా ఆమె నటించిన డీజే మంచి విజయం అందుకుంది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ల చిత్రాలు వున్నాయి. ఈ మధ్యకాలంలో ఒకేసారి ముగ్గురు అగ్రహీరోల చిత్రాల్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అమ్మడు కేవలం పూజానే అని చెప్పవచ్చు.

మోహేన్జదారో చిత్రంతో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ తో కలిసి నటించిన ఈ అమ్మడుకి అక్కడ చేదు అనుభవమే ఎదురయింది. కాగా ప్రస్తుతం ఆమెకు మరొక బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని సమాచారం. సాజిద్ నడియాద్వాల నిర్మాతగా, సాజిద్ ఖాన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, బాబీ డియోల్ హీరోలుగా భారీ బడ్జెట్ మరియు తారాగణంతో రూపొందనున్న హౌస్ ఫుల్ 4 చిత్రంలో పూజ మంచి కీ రోల్ కి ఎంపికయినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, శ్రీవాస్ రూపొందిస్తున్న సాక్ష్యం చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది….

సంబంధిత సమాచారం

తాజా వార్తలు