హైద్రాబాద్‌లో పూనమ్ పాండే సందడి!

హైద్రాబాద్‌లో పూనమ్ పాండే సందడి!

Published on Aug 27, 2015 7:11 PM IST

poonam-pandey
పూనమ్ పాండే.. దేశవ్యాప్తంగా తనదైన మార్క్ స్టేట్‌మెంట్స్‌తో అందరి దృష్టినీ తనవైపు మళ్ళించుకున్న స్టార్ మోడల్. పూనమ్ పాండే ఇప్పటివరకూ చేసిన స్టేట్‌మెంట్స్ కొన్ని వివాదాలకు కేంద్రం కాగా, ఇంకొన్ని దుమారమే రేపాయి. సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయిన పూనమ్ పాండే ఇప్పుడు సినిమాల ద్వారా కూడా తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమైపోయారు. ‘మాలిని అండ్ కో’ పేరుతో పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటించిన సినిమా విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

వీరు.కె దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కిషోర్ రాటి సమర్పించారు. మహేష్ రాటి ‘మాలిని అండ్ కో’ సినిమా నిర్మాత. ఇప్పటికే అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు (ఆగష్టు 28న) విడుదల కానుంది. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా పూనమ్ పాండే గత రెండు రోజుల నుండి హైద్రాబాద్‌లో సందడి చేస్తున్నారు. తాను నటించిన మొదటి సినిమా విడుదలవుతుందంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పూనమ్ పాండే తెలిపారు. ఈ మసాల యాక్షన్ ఎంటర్‌టైనర్ అందరికీ నచ్చుతుందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.

ఇక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా పలు పత్రికా, మీడియా ఇంటర్వ్యూలతో గడిపిన పూనమ్ పాండే మరో ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణాల్లోని పలుప్రాంతాల్లో ప్రమోషన్స్ చేయనున్నట్లు సమాచారం. రేపు థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి పూనమ్ సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు