పవన్ పై మరో సాంగ్ చేసిన పాప్ సింగర్

పవన్ పై మరో సాంగ్ చేసిన పాప్ సింగర్

Published on Aug 3, 2015 1:32 PM IST

baba-sehgal-pawan-kalyan
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రిక్షావోడు’ సినిమాలో ‘రూపు తేరా మస్తానా’ అనే పాటతో తెలుగు ప్రేక్షలుల మదిని కొల్లగొట్టిన ఇండియన్ ఫేమస్ పాప్ సింగర్ బాబా సెహగల్. రీసెంట్ గా ‘జల్సా’, ‘అదుర్స్’, ‘గబ్బర్ సింగ్’ లాంటి సినిమాల్లో పాటలు పాడి ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు బాబా సెహగల్. గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ పాడిన టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ చూసి ఆయనకి అభిమానిగా మారిన బాబా సెహగల్ స్పెషల్ గా పవన్ కళ్యాణ్ పై ఓ స్పెషల్ గా రాయడమే కాకుండా కంపోజ్ చేసి 2012 లో పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసాడు. ఆ పాటకి అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా అదే ఫీట్ ని మరోసారి రిపీట్ చేయనున్నాడు బాబా సెహగల్. రీసెంట్ గా బాగా సెహగల్ ఈ ఏడాది పవన్ కళ్యాణ్ బర్త్ డే(సెప్టెంబర్ 2) కానుకగా మరోసా పవర్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు తెలియజేశాడు. ఇన్ని రోజులు సింగర్ గా ఉన్న బాబా సెహగల్ తాజాగా నటుడిగా మారి బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను రుద్రమదేవి సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఇది కాకుండా నాగ చైతన్య – గౌతమ్ మీనన్ – సింబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు