తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ మలయాళ నటుడు !

తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ మలయాళ నటుడు !

Published on Jan 17, 2017 9:07 PM IST

jayaram
మలయాళ, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన ప్రసిద్ధ నటుడు జయరాం త్వరలో తెలుగు పరిశ్రమలోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడు. తుపాకీ, పంచతంత్రం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఇప్పటివరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ లో ఈయన ఒక కీ రోల్ చేస్తున్నాడు.

ఈ చిత్రంలో ఆయన ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడని, ఆయన పాత్ర సినిమాకి చాలా కీలకమైనదని, అందరినీ ఆకట్టుకుంటుందని చిత్ర దర్శకుడు ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ తెలిపారు. అనుష్కతో పాటు ‘జనతా గ్యారేజ్’ ఫేమ్ ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో నటిస్తుండగా థమన్ ఎస్ఎస్ సంగీతం అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు