‘ఓకే బంగారం’ ప్రీమియర్ షోస్ టాక్

‘ఓకే బంగారం’ ప్రీమియర్ షోస్ టాక్

Published on Apr 17, 2015 8:28 AM IST

ok-bangaram
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు చెప్పగానే మన మదిలో కొన్ని అద్భుతమైన సినిమాలు మెదిలే దర్శకులు చాలా తక్కువ మండే ఉన్నారు. అలాంటి దర్శకులలో ముందుండే డైరెక్టర్ మణిరత్నం. మణిరత్నం ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో చేసిన లేటెస్ట్ మూవీ ‘ఓకే బంగారం’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతోంది. సినీ వర్గాల్లో పూర్తి పాజిటివ్ టాక్ ఉంది.

ఇప్పటికే ఓకే కన్మణి కి చెందిన కొన్ని ప్రీమియర్స్ పడ్డాయి. చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. సినిమా బాగా యూత్ ఫుల్ గా ఉందని అంటున్నారు. ఇప్పటి తరానికి చెందిన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా యువతకి బాగా నచ్చేస్తుందని అంటున్నారు. సెన్సార్ నుంచి ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకుంది.

మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు