సౌత్ ఇండియాలోనే ప్రభాస్ ఒక్కడే

సౌత్ ఇండియాలోనే ప్రభాస్ ఒక్కడే

Published on Jun 6, 2020 11:50 AM IST

బాహుబలి సినిమా తరువాత అనేక రికార్డ్స్ తన పేరున రాసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా ఫాలోయింగ్ లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. భాహుబలి, బాహుబలి 2 మరియు సాహో చిత్రాలు ఆయన్ని అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా నిలబెట్టాయి. కాగా ప్రభాస్ పేస్ బుక్ ఫాలోవర్స్ సంఖ్య 14మిలియన్స్ కి చేరింది. సౌత్ ఇండియాలో మరే హీరోకి ఇంత మంది పేస్ బుక్ ఫాలోవర్స్ లేరు. ఆ విధంగా మరో రికార్డు ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణతో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్నాడు. 1960కాలం నాటి ప్రేమ కథగా, యూరప్ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ఇప్పటికే సమాచారం ఉంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు