ఫోటో మూమెంట్ : వారిద్దరూ మళ్ళీ కలిశారు..!

ఫోటో మూమెంట్ : వారిద్దరూ మళ్ళీ కలిశారు..!

Published on Mar 29, 2015 3:25 PM IST

Prakash-Raj-B'day

ఈ ఫోటో చూస్తే ఏమనిపిస్తోంది ? శ్రీనువైట్ల-ప్రకాష్ రాజ్‌లు మళ్ళీ కలిసిపోయారా.. అనే ఆశ్చర్యం కలుగుతోంది కదూ ? అవును.. వారిద్దరూ మళ్ళీ కలిశారు. గతంలో దూకుడు సినిమాకు శ్రీనువైట్ల, ప్రకాష్ రాజ్‌లు కలిసి పనిచేశారు. దూకుడులో ఒక బలమైన పాత్రలో ప్రకాష్ మెరిశారు. ఆ తర్వాత శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఆగడు సినిమాలోనూ ఈ ఇద్దరూ కలిసి పనిచేయాల్సింది. అయితే కొన్ని ఇగో ప్రాబ్లమ్స్‌తో ఆ పాత్రకు వేరొకరిని తీసుకున్నారు.

ఇదే విషయమై ‘ఆగడు’ సినిమా విడుదల తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరీ విమర్శల వర్షం గుప్పించుకున్నారు. శ్రీనువైట్ల అహంకారం వల్లే ఆగడు నుంచి తప్పుకున్నానని ప్రకాష్, ప్రకాష్ విపరీత దోరణి వల్లే ఆగడులో ఆయన్ని తప్పించామని శ్రీనువైట్ల.. ఇలా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి మళ్ళీ ఎక్కడా కనపడలేదు. తాజాగా ప్రకాష్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా వీరిలా నవ్వుతూ కెమెరాలకు దర్శనమిచ్చారు. ఇక ఈ ఫోటోను చూసిన తర్వాత ఇటు ప్రకాష్ అభిమానులు, అటు శ్రీనువైట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అందరూ కలిసి పనిచేస్తేనే సంచలనాలు నమోదు చేయగలం అని నమ్మడం, ఇగోలను పక్కనపెట్టి ఇలా కలిసిపోవడం అటు ఆ ప్రముఖులకు, సినీ పరిశ్రమకూ మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఇది శుభపరిణామం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు