అత్తారింటికి దారేదిలో నటించిన బాపు బొమ్మ ప్రణీతకు ప్రస్తుతం చేతిలో ఆఫర్లు కరువయ్యాయి. ఆమె ఆఖరి చిత్రం ‘రభస’ ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. అయితే రొట్టె విరిగి నేతిలో పడినట్టు అనుకోని కారణాల వలన సూర్య ‘మాస్’ చిత్రం నుండి అమీ జాక్సన్ ని తప్పించి ఆ స్థానం ప్రణీతకు ఇచ్చారు
మాస్ సినిమాను గతంలో కార్తీతో బిర్యాని తీసిన వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సూర్య ఈ సినిమాలో నయనతార, ప్రణీతలతో జతకట్టనున్నాడు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్నాడు