కొత్త సినిమాను మొదలుపెట్టనున్న దేవ కట్ట !

కొత్త సినిమాను మొదలుపెట్టనున్న దేవ కట్ట !

Published on May 22, 2018 6:01 PM IST

శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ లు ప్రధాన పాత్రల్లో దర్శకుడు దేవ కట్ట రూపొందించిన చిత్రం ‘ప్రస్థానం’. 2010లో విడుదలైన ఈ చిత్రంతో అనేక మంది సినీ ప్రేమికులకు అభిమాన దర్శకుడిగా మారారు దేవ కట్ట. ఆ తరవాత అయన చేసిన ‘ఆటో నగర్ సూర్య’ పరాజయం చెందటంతో వెనుకబడ్డారాయన.

ఆ చిత్రం తరవాత సుమారు 4 ఏళ్ళు సినిమా చేయని ఆయన ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపడుతున్నారు. అది కూడ హిందీలో. తమకు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన ‘ప్రస్థానం’ సినిమానే హిందీలో రీమేక్ చేయనున్నారు దేవ. ఈ రీమేక్ జూన్ 1న ముంబైలో మొదలుకానుంది. ఇందులో స్టార్ హీరో సంజయ్ దత్, యువ హీరో అలీ ఫజల్ ప్రధాన పాత్రలు చేయనుండగా అమైరా దస్తూర్ కథానాయిక పాత్రను పోషించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు