యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో హై స్టాండర్డ్స్ టెక్నాలజీతో తెరెకెక్కిన ‘సాహో’ చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. ఆ సినిమా కోసం అభిమానులు ఎదురుచూసిన ఎదురుచూపులు రిలీజ్ సమయంలో వాళ్ళు చేసిన హడావుడి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి చేయలేదు. అయితే థియేటర్ ముందు ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ఓ అభిమాని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ఈ ఘటన జరిగింది.
కాగా ఆ ఘటనలో తీవ్రంగా గాయాలు పాలయిన ఆ అభిమాని కుటుంబానికి నిర్మాత దిల్ రాజ్ మరియు శ్రీనివాస్ గౌడ్ కలిసి 7 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయాన్ని అందించారు. టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్ జిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియస్ ప్రోడక్షన్ హౌస్ యువి క్రియెషన్స్ బ్యానర్ లో వంశి, ప్రమెద్, విక్రమ్ లు సంయుక్తంగా నిర్మించారు.