లాజిక్ లేని సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’!

లాజిక్ లేని సినిమా ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’!

Published on Feb 28, 2017 9:03 AM IST


ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’. పేరులోనే పూర్తి వైవిధ్యాన్ని నింపుకున్న ఈ సినిమా ట్రైలర్స్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం యొక్క అన్ని పనులు నిన్నటితో పూర్తి కావడంతో చిత్ర యూనిట్ గుమ్మడికాయ వేడుక నిర్వహించారు. ఈ సందర్బంగా హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ ‘సంవత్సరం క్రితం నిర్మాత అనిల్ సుంకర ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు దర్శకుడెవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తే అనిల్ గారు వంశీ కృష్ణని సజస్ట్ చేశారు. అనుకున్నట్టే వంశీ చాలా బాగా తీశారు’ అన్నారు.

అదే విధంగా నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ ‘వంశీ కృష్ణ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇందులో లాజిక్స్ ఏమీ ఉండవు. అన్నీ మ్యాజిక్కులే ఉంటాయి. ప్రతి సీన్ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చాలా కొత్తగా ఉంటుంది’ అన్నారు. ‘మజ్ను’ ఫేమ్ అను ఎమ్మన్యుయెల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా హంసా నందిని ఓ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించిన ఈ చిత్రం మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు