సైలెంట్‌గా కొత్త సినిమా మొదలుపెట్టిన పూరీ!

సైలెంట్‌గా కొత్త సినిమా మొదలుపెట్టిన పూరీ!

Published on Nov 29, 2015 2:23 AM IST

Puri-Jagannadh
దర్శకుడు పూరీ జగన్నాథ్ ఏది చేసినా సంచలనమే! స్టార్ హీరోలతో బ్లాక్‍బస్టర్ సినిమా చేసిన వెంటనే మళ్ళీ ఓ మిడిల్ లెవెల్ బడ్జెట్‌లో డిఫరెంట్ సినిమా తీసి సంచలనం సృష్టిస్తూ ఉంటారు. ఈ మధ్యే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌‌తో కలిసి చేసిన ‘లోఫర్’ సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేసేసిన పూరీ, ఆ వెంటనే ఓ కొత్త హీరోతో చేయనున్న సినిమాను అప్పుడే సెట్స్‌పైకి తీసుకెళ్ళిపోయారు. ‘లోఫర్’ తర్వాత పూరీ ఇషాన్ అనే కొత్త హీరోను పరిచయం చేస్తూ రోగ్ అనే సినిమా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇషాన్ సరసన అయేషా శర్మ, ఏంజిలా క్రిస్లింకి హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్‌ను పూరీ తన ఫేవరైట్ ప్లేస్ అయిన బ్యాంకాక్‌లో మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఇషాన్, ఏంజిలాల నేపథ్యంలో పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఒకపక్క స్టార్ హీరోలు పూరీతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా పూరీ తనదైన పంథాలో ఇలా కొత్త హీరోలతోనూ సినిమాలు చేస్తూ పోవడం విశేషంగానే చెప్పుకోవచ్చు. పూరీ లోఫర్ సినిమా విషయానికి వస్తే.. డిసెంబర్ 18న ఈ సినిమాను విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. డిసెంబర్ 7న ఆడియో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు