నితిన్ పక్కన నటించనున్న రాశి ఖన్నా ?

నితిన్ పక్కన నటించనున్న రాశి ఖన్నా ?

Published on Feb 16, 2018 5:13 PM IST

నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ‘ఛల్ మోహన్ రంగ’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మేఘా ఆకాష్ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా పూర్తైన వెంటనే ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాలో నటించబోతున్నాడు నితిన్. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమాను సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహించబోతున్నాడు. మిక్కి జే మేయర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఏప్రిల్ లో ప్రారంభంకానున్న ఈ సినిమాలో నందిత శ్వేత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం మేరకు రాశీఖన్నా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని తెలుస్తోంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకేక్కించబోతున్నాడు దర్శకుడు. ‘ఛల్ మోహన్ రంగ’ సినిమా టీజర్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు