రాశీ ఖన్నా కోరిక నెరవేరుతుందా ?

రాశీ ఖన్నా కోరిక నెరవేరుతుందా ?

Published on Oct 16, 2019 3:28 PM IST

గత కొన్నాళ్ళుగా రాశీ ఖన్నాకు టాలీవుడ్లో టైమ్ కలిసి రావట్లేదు. ‘తొలిప్రేమ’ తర్వాత ఆమెకు ఆ స్థాయి హిట్ దక్కలేదు. ఫ్యామిలీ హీరోయిన్ అనే పేరు తెచ్చుకోవాలనే తపనతో రాశీ ‘శ్రీనివాస కళ్యాణం’ అనే సినిమా చేసింది. అందులో రాశీ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనే పేరొచ్చింది కానీ సినిమా తీవ్ర నిరాశ కలిగించింది. దీంతో ఆమె ఆశలకు గండి పడింది.

అయినా ఈ చబ్బీ బ్యూటీ కుటుంబ కథా చిత్రాలకు గుడ్ బై చెప్పలేదు. కొంచెం గ్యాప్ తీసుకుని ‘ప్రతిరోజూ పండగే’ చిత్రానికి సైన్ చేసింది. సాయి తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కూడా కుటుంబ కథా చిత్రమే. మారుతి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాతో అయినా కుటుంబ ప్రేక్షకులకు దగ్గరవాలని రాశీ ఖన్నా భావిస్తోంది. పైగా తెలుగులో లైమ్ లైట్లో ఉండాలంటే ఆమెకు హిట్ చాలా అవసరం.

గీతా ఆర్ట్స్ 2, యువీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. ఇకపోతే నిన్న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు