హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తన కొత్త స్క్రిప్ట్ను పూర్తి చేసే దిశలో ఉన్నాడు. అయితే స్క్రిప్ట్ రాస్తోంది సినిమా కోసం కాదు, వెబ్ సిరీస్ కోసమట. ఆహా కోసం ఒరిజినల్ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నాడట. ఈ వెబ్ సిరీస్ ఏభై ఏళ్ల ముసలోడితో ప్రేమలో పడిన పాతికేళ్ళ అమ్మాయి ప్రేమకథ అని తెలుస్తోంది. ఏభై ఏళ్ల పాత్రలో బ్రహ్మాజీ నటించబోతున్నాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక తన మొదటి సినిమా ‘చి.ల.సౌ’తోనే మంచి హిట్ అందుకున్నాడు రాహుల్. పైగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది ఆ సినిమా. కాగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో భాగమైన ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నట్లు కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం డైరెక్టర్ గా బిజీ అవుతుండటం విశేషం.
అయితే తన రెండో చిత్రంగా కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మన్మథుడు 2ను తెరకెక్కించాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది.