సెన్సార్ పని పూర్తి చేసుకున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ !

సెన్సార్ పని పూర్తి చేసుకున్న ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ !

Published on Feb 21, 2017 3:18 PM IST


యంగ్ హీరో రాజ్ తరుణ్ చేస్తున్న చిత్రాల్లో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కూడా ఒకటి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 3వ తేదీన రిలీజుకు సిద్ధమైంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్, పాటలతో బాగా ఇంప్రెస్ చేసిన ఈ సినిమా తాజాగా ముఖ్యమైన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది.

పెంపుడు కుక్కల్ని కిడ్నాప్ చేసే యువకుడి కథగా పూర్తి వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తుండగా ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం, సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు