కొత్త జానర్ లో రాజ్ తరుణ్ సినిమా…?

కొత్త జానర్ లో రాజ్ తరుణ్ సినిమా…?

Published on Jun 1, 2016 9:08 AM IST

rajtaraun
‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’, ‘ఈడో రకం ఆడో రకం’ సినిమాల వరుస హిట్స్‌తో మంచి ఊపుమీదున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓ కొత్త సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. ఈ సినిమా రాజ్ తరుణ్ గత సినిమాలకు భిన్నంగా ఉండే క్రైమ్ కామెడీ సినిమా అని సమాచారం. ఈ సినిమాకు ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు.

వంశీకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో రాజ్ తరుణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. క్రైమ్ కామెడీ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ పూర్తిగా కొత్తగా కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమా డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు