నాగ చైతన్య విన్న కథతో సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ !

నాగ చైతన్య విన్న కథతో సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ !

Published on Dec 3, 2016 11:53 AM IST

raj-tarun
‘ఈడో రకం ఆడో రకం’ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు’ వంటి రెండు సినిమాల్ని చేస్తున్నాడు. ఇవి రెండు కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో కూడా ఒక సినిమాను మొదలుపెట్టాడట ఈ యంగ్ హీరో. ఈ చిత్రాన్ని తమిళ దర్శకురాలు రాగిణి డైరెక్ట్ చేస్తుందట. ఈమె గతంలో ప్రముఖ దర్శకుడు గావుత మీనన్ వద్ద శిష్యరికం చేసి దర్శకురాలిగా తోలి అడుగు వేస్తోంది.

మొదట ఈమె ఈ కథను నాగ చైతన్యకు వినిపంచగా అప్పుడున్న బిజీ కమిట్మెంట్ల వలన చైతు ఆ సినిమా చేయడానికి ఖాళీ లేదని రాజ్ తరుణ్ అయితే ఆ కథకు సరిపోతాడని రెఫర్ చేశాడట. దాంతో దర్శకురాలు రాగిణి రాజ్ తరుణ్ తో మాట్లాడి కథ వినిపించడం, సినిమా మొదలవడం అన్నీ జరిగిపోయాయట. తనకు మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాల’ అవకాశమిచ్చిన సంస్థ కావడంతో రాజ్ వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్టుకు సంబందించిన వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు