ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన రాజమౌళి.!

ప్రభాస్ ఫ్యాన్స్ కి సారీ చెప్పిన రాజమౌళి.!

Published on Oct 23, 2014 9:51 PM IST

Rajamouli
టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గత 4-5 నెలలుగా కంటిన్యూగా షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర టీం దీపావళి సందర్భంగా ఈ రోజు బ్రేక్ తీసుకున్నారు. రేపటి నుంచి యధావిధిగా షూటింగ్ జరగనుంది.

స్పెషల్ వీడియో ద్వారా తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎస్ఎస్ రాజమౌళి ప్రభాస్ ఫ్యాన్స్ కి క్షమాపణ కూడా చెప్పారు. ‘ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను క్షమించాలి. ఎందుకంటే మీ హీరోని 2 సంవత్సరాలుగా మీకు దూరం చేసేసాను. ఒక పెద్ద సినిమా అందించాలనే ఉద్దేశంతో ఇంత ఆలస్యం అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యాక ఆ కోపాన్ని మరిచిపోతారని ఆశిస్తున్నాను. మొదట్లో ప్రతి నటీనటుల బర్త్ డే కి కొన్ని వీడియోలని రిలీజ్ చేసే వాళ్ళం, కానీ ఇప్పుడు పని ఒత్తిడి వల్ల చేయలేకపోతున్నామని’ రాజమౌళి తెలిపాడు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మన ముందుకు తీసుకురానున్నారు. అందులో ఒక పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ప్రభాస్ పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు