మార్చ్ నుంచి రజినీ – అక్షయ్ లపై భారీ యాక్షన్ ఎపిసోడ్

మార్చ్ నుంచి రజినీ – అక్షయ్ లపై భారీ యాక్షన్ ఎపిసోడ్

Published on Feb 10, 2016 7:31 PM IST

robot
సౌత్ ఇండియాలో రూపొందుతున్న రెండు క్రేజీ మరియు భారీ ప్రాజెక్ట్స్ సినిమాలు రోబోకి సీక్వెల్ అయిన ‘2.0’, బాహుబలికి సీక్వెల్ అయిన ‘బాహుబలి – ది కంక్లూజన్’. ఇందులో బాహుబలిని పక్కన పెట్టి 2.0 విషయానికి వస్తే. దిసేమబార్ లో జరిగిన మొదటి షెడ్యూల్ లో రజినీకాంత్ పాల్గొన్నాడు. ఆ తర్వాత కబాలి షూట్ ఫినిష్ చేయడం కోసం కబాలి సినిమా షూటింగ్ కి షిఫ్ట్ అయ్యాడు. ప్రస్తుతం రజినీకాంత్ కబాలి ఫైనల్ షెడ్యూల్ లో భాగంగా మలేషియాలో ఉన్నాడు. మార్చ్ నుంచి రజినీకాంత్ మళ్ళీ 2.0 టీంతో జాయిన్ అవుతాడు.

2.0 టీం నుంచి తెలిసిన ప్రత్యేక సమాచారం ప్రకారం మార్చ్ నుంచి రజినీకాంత్ – అక్షయ్ కుమార్ ల మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. ‘ఈ యాక్షన్ ఎపిసోడ్ లో భారీ ఎత్తున విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే శంకర్ ఓ రెండు రోజులు విలన్స్ పై ఓ డమ్మీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేసి, దానిని విఎఫ్ఎక్స్ వర్క్ కి పంపుతారు. విఎఫ్ఎక్స్ టీం ఇచ్చే అవుట్ పుట్ ని చూసిన తర్వాత ఆయన రియల్ యాక్షన్ ఎపిసోడ్ ని రజినీకాంత్ – అక్షయ్ కుమార్ లపై షూట్ చేస్తాడని’ ఈ చిత్ర సన్నిహితులు చెప్పారు. శ్రీనివాస్ మోహన్ విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్ పై సుమారు 350 కోట్లతో నిర్మించనున్న ఈ సినిమాకి ఎర రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు