‘మేము సైతం’కి ముఖ్య అతిధులుగా రజినీ, కమల్, రెహమాన్.!

‘మేము సైతం’కి ముఖ్య అతిధులుగా రజినీ, కమల్, రెహమాన్.!

Published on Oct 30, 2014 4:13 PM IST

rajini-kamal-ar-vikaram
టాలీవుడ్ స్టార్స్, టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అంతా ఒక్కటై హుదూద్ బాధితుల కోసం చేయనున్న కార్యక్రమం ‘మేము సైతం’. ‘వీ లవ్ వైజాగ్’ అనే ట్యాగ్ లైన్ తో గ్రాండ్ గా జరగనున్న ఈ వేడుక నవంబర్ 9న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. ఈ వేడుకకి ఒక్క తెలుగు హీరోలే కాకుండా తమిళ హీరోలైన సూర్య, కార్తీ కూడా హాజరు కానున్నాడని ఇది వరకే తెలియజేశాం.

ఫిలిం ఇండస్ట్రీలో ఈ వేడుక గురించి జరుగుతున్న చర్చల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ‘తెలుగు చిత్ర మండలి వారు తమిళ స్టార్స్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్, విక్రమ్, డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎఆర్ రెహమాన్, హారీష్ జయరాజ్ లను కూడా ఈ వేడుకకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంగా తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు వీళ్ళందరినీ కాంటాక్ట్ అయ్యారు. త్వరలోనే వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే ఎఆర్ రెహమాన్ చేత లైవ్ లో ఓ కాన్సెర్ట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారని’ సమాచారం.

సుమారు 13 గంటల పాటు జరగనున్న ఈ లైవ్ ఈవెంట్ కి తెలుగు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ ద్వారా వచెహ్ డబ్బు మొత్తాని హుదూద్ బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ సిఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు