శ్రీదేవి మృతిపై రజినీకాంత్, సుబ్బిరామిరెడ్డి సంతాపం !

శ్రీదేవి మృతిపై రజినీకాంత్, సుబ్బిరామిరెడ్డి సంతాపం !

Published on Feb 25, 2018 12:22 PM IST

బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో సుస్ధిరస్ధానం పొంది తెలుగు హిందీ తమిళ మళయాళ కన్నడ భాషల్లో అగ్ర హీరోయిన్ గా ఎదిగి అనేక ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు పద్మశ్రీని సైతం పొందిన సుప్రసిద్ధ సినీనటి, అతిలోక సుందరి శ్రీదేవి మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీవ్ర ద్రిగ్భంతిని కలిగించింది.

ఆమె లేని లోటు తీర్చలేనిదని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా శ్రీదేవితో మంచి సాన్నిహిత్యం ఉందని బాలీవుడ్ లో యాష్ చోప్రా రూపొందించిన ‘చాందిని, లమ్హే’ చిత్రాలు శ్రీదేవి నటజీవితానికి ఎంతో వన్నె తెచ్చాయని ఎం.పి సుబ్బిరామిరెడ్డి తెలిపారు. నేను మంచి స్నేహితురాలిని కోల్పోయానని శ్రీదేవి కుటుంబానికి నా ప్రఘాడ సానుభూతి తెలుపుతున్నానని రజినీకాంత్ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు