రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తెలుగు సినిమాలో కొత్తగా అవతరించిన స్టార్ హీరోయిన్. సూపర్ స్టార్ మహేష్తో ఒక సినిమా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ‘ధృవ’, సాయిధరమ్ తేజ్తో ‘విన్నర్’.. ఇలా మూడు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా మారిపోయారు. ఈ మూడు సినిమాలను షిఫ్ట్లుగా మార్చుకుంటూ రకుల్ పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ‘ధృవ’ సినిమాకు సంబంధించిన పరేషానురా అనే పాట షూటింగ్తో బిజీగా ఉన్నారు. ఆడియోలో ఇప్పటికే సూపర్ హిట్గా నిలిచిన ఈ పాట షూట్తో ధృవ ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుందట.
డిసెంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా కోసం టీమ్ ఇప్పట్నుంచే భారీ ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలని ప్లాన్ చేసింది. షూట్ మొత్తం పూర్తవ్వగానే రామ్ చరణ్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొననున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.