ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ !

ఒకేసారి రెండు పెద్ద సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ !

Published on Apr 26, 2018 3:19 PM IST

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చెన్నై, ముంబైల మధ్య చక్కర్లు కొడుతూ బిజీగా ఉన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ఈమె తమిళంలో సూర్య, సెల్వరాఘవన్ ల ‘ఎన్.జి.కె’ చిత్రంలో కథానాయకిగా నటిస్తోంది. ఇటీవలే నిర్మాతల మండలి నిరసన ముగియడంతో ఆమె ఆ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. నిన్ననే మొదటి షెడ్యూల్ ముగిసింది. దర్శకుడు సెల్వ రాఘవన్ రకుల్ పెర్ఫార్మెన్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు కూడ.

దాంతో రకుల్ వెంటనే అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్ తో చేస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కోసం ముంబై వెళ్లిపోయారు. ఆమె ఈరోజు నుండే ఆ చిత్ర షూటింగ్లో పాల్గొననున్నారు. ఇలా ఒకేసారి తమిళ, హిందీ రెండు సినిమాల్ని మేనేజ్ చేస్తున్న రకుల్ ఇంకొన్నాళ్ల పాటు ఇలాగే చెన్నై, ముంబై షెడ్యూళ్లతో బిజీగా ఉండనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు