‘గోవిందుడి’కి డబ్బింగ్ ముగించిన రామ్ చరణ్

‘గోవిందుడి’కి డబ్బింగ్ ముగించిన రామ్ చరణ్

Published on Sep 24, 2014 10:28 PM IST

Govindudu-Andarivadele
రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా అక్టోబర్ 1న రికార్డు లెవల్లో విడుదలకావడానికి సిద్ధపడుతుంది. ఈ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించాడు. బండ్ల గణేష్ నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం చెర్రీ తన పార్ట్ డబ్బింగ్ పూర్తిచేసుకున్నాడు

ఈ కుటుంబ కధా చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్, కమిలినీ ముఖర్జీ, శ్రీకాంత్ వంటి నటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఇప్పటికే శ్రోతల మదిలో నిలిచాయి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు