ఛారిటీ కోసం రామ్ చరణ్ లైవ్ పర్ఫామెన్స్!

ఛారిటీ కోసం రామ్ చరణ్ లైవ్ పర్ఫామెన్స్!

Published on Sep 25, 2016 5:47 PM IST

ram-charan1m char

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ సమాజ సేవ విషయంలోనూ ముందుంటారు. తాజాగా ఆయన ఇదే విషయాన్ని మరోసారి ఋజువు చేస్తూ ఓ మంచి కార్యక్రమం కోసం పాటుపడుతున్నారు. రిపబ్లికన్ హింది కొలిషన్ (ఆర్.హెచ్.సీ) ఛైర్మన్ శైలి కుమార్ నిర్వహించనున్న హ్యుమానిటీ అగైనస్ట్ టెర్రర్ అనే ఈవెంట్‌లో రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనుండడం విశేషంగా చెప్పుకోవాలి. అక్టోబర్ 15న అమెరికాలోని న్యూజెర్సీలో ఈ ఈవెంట్ జరగనుంది.

ఇక ఈ ఈవెంట్ ద్వారా వచ్చే డబ్బు మొత్తాన్నీ ఆర్‍హెచ్‍సీ సంస్థ టెర్రరిస్ట్ బారిన కుటుంబాలకు అందించనుంది. ఇక ఇలాంటి ఒక చారిటీ ఈవెంట్‌లో పాల్గొననుండడం ఎంతో గర్వంగా ఉందని రామ్ చరణ్ తెలుపుతూ, అమెరికాలో తన మొదటి లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్ ధృవ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో పడిపోయారు. అక్టోబర్ నెల్లోనే ‘ధృవ’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు