వాళ్ళను వదిలిపెట్టనుంటున్న వర్మ..!

వాళ్ళను వదిలిపెట్టనుంటున్న వర్మ..!

Published on Dec 12, 2019 8:54 PM IST

ఎట్టకేలకు పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను థియేటర్స్ లో దింపారు రామ్ గోపాల్ వర్మ. అనేక వివాదాలు, కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూవీ విడుదల అసాధ్యమే అనుకున్నారంతా. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని సెన్సార్ చేయకుండా పెండింగ్ లో పెట్టారు. వర్మ కోర్టు నుండి ప్రత్యేక ఆర్డర్ తెచ్చుకొని ఈ మూవీ సెన్సార్ చేయించుకొన్నారు. ఐతే ఈ మూవీ సెన్సార్ విషయంలో కొందరు కావాలనే ఇబ్బందులు కలిగించారని ఆయన ఆరోపణలు చేశారు. కుట్ర పూరితంగా మా సినిమా విడుదల అడ్డుకున్నారన్నారు.

ఐతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధం అవుతున్నానంటూ ఆయన బాంబు పేల్చారు. ఈ కుట్రలో పాలుపంచుకున్న అందరిని చట్టం ముందు ద్రోషులుగా నిలబెడతానంటూ ఆయన శబధం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పొలిటికల్ పరిస్థితులకు కొంత ఫిక్షన్ జోడించి ఈ మూవీ చేసినట్లు రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీలో అజ్మల్ అమీర్, బ్రహ్మానందం, అలీ, ధన్ రాజ్, కత్తి మహేష్ తదితరులు నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు