తమిళ ప్రమోషన్లపై దృష్టి పెట్టిన రానా !

తమిళ ప్రమోషన్లపై దృష్టి పెట్టిన రానా !

Published on Sep 18, 2017 5:20 PM IST


నటుడు రానా చేసిన తాజా చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’ తెలుగునాట ఘనవిజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో రానాకు సోలో హీరోగా పెద్ద కమర్షియల్ హిట్ లభించినట్లైంది. దర్శకుడు తేజ కూడా చాలా కాలం తర్వాత ప్రేక్షకులకు సంతృప్తినిచ్చే చిత్రాన్ని తీశారనే ప్రశంసలను అందుకున్నారు. ఈ చిత్ర తమిళ వెర్షన్ ను తెలుగుతో పాటే ఒకేసారి రూపొందించారు తేజ. కానీ కొన్ని అనుకోని కారణాల వలన రెండింటినీ ఒకేసారి రిలీజ్ చేయలేకపోయారు.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగిపోగా చిత్రాన్ని ‘నాన్ అనైయిట్టల్’ పేరుతో ఈ నెల 22న తమిళనాట రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాట నెలకొన్న రాజకీయ పరిస్థిత్యుల దృష్ట్యా చిత్ర ఫలితం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్న టీమ్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం రానా, డైరెక్టర్ తేజ ఇద్దరూ తమిళనాడులోని శ్రీ సాయి రామ్ ఇంజనీరింగ్ కళాశాలలో సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంకా రెండు రోజుల వ్యవధి ఉండటంతో చిత్ర టీమ్ ఇంకొన్ని ప్రమోషనల్ ఈవెంట్లను కూడా నిర్వహించే అవకాశాముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు