“విరాట పర్వం” సీనియర్ నటికి కరోనా పాజిటివ్.!

“విరాట పర్వం” సీనియర్ నటికి కరోనా పాజిటివ్.!

Published on Sep 22, 2020 12:02 PM IST

టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ “విరాట పర్వం” ఎప్పటి నుంచో అలా డిలే అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్ గా సాయి పల్లవి, అలాగే మావో రోల్ లో ప్రియమణి వీరితో పాటుగా బాలీవుడ్ కు చెందిన సీనియర్ నటి జరీనా వాహాబ్ కూడా నటిస్తున్నారు. అయితే ఈమెకు ఇపుడు కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యిందని తెలుస్తుంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం ఆమె కరోనా ప్రభావ లక్షణాలు కలిగి ఉన్నారట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు, జ్వరం సహా ఇతర లక్షణాలు ఉన్నాయట అలాగే ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గడంతో ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ లో జాయిన్ చేశారట. అయితే ఆమె భర్త ఆదిత్య పంచోలి ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు