మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ‘రంగ్ దే’

మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన ‘రంగ్ దే’

Published on Mar 29, 2020 5:20 PM IST

నితిన్, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రంగ్ దే. నేడు ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో కూడిన నితిన్ మరియు కీర్తి సురేష్ ల మోషన్ పోస్టర్ ఆసక్తి రేపుతోంది. అను మరియు అర్జున్ అనే యంగ్ కపుల్ మధ్య జరిగే రొమాంటిక్, సెన్సిబుల్ లవ్ స్టోరీగా రంగ్ దే ఉంటుందని అర్థం అవుతుంది. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు చిత్ర యూనిట్.

సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. చాల గ్యాప్ తరువాత భీష్మ చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు నితిన్. ఆ సినిమాకు కూడా నిర్మాత నాగవంశీ కావడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రంగ్ దే సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి.

మోషన్ పోస్టర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు