అజయ్ భూపతి ‘సముద్రం’ అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజేయ్, శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా రాశి ఖన్నా నటించబోతుందట. అజయ్ ఇప్పటికే రాశి ఖన్నాకి కథ కూడా వివరించారట. రాశి ఖన్నా కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట,
ఏమైనా “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమా కోసం మాత్రం అజేయ్ భూపతి బాగా ఎదురుచూడాల్సిన పరిస్థితి. అన్నట్టు ఈ సినిమా ఎకె ఎంటర్ టైన్మెంట్స్ కాంపౌండ్ లోకి వచ్చింది. కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఇక ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.