కొత్త సినిమాకి సైన్ చేసిన రష్మి గౌతమ్ !

కొత్త సినిమాకి సైన్ చేసిన రష్మి గౌతమ్ !

Published on May 28, 2017 4:33 PM IST


చిన్న చిన్న పాత్రలతో నటిగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత యాంకర్ గా ‘జబర్దస్త్’ వంటి షోలతో టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న రష్మీ గౌతమ్ 2016లో విడుదలైన అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ ‘గుంటూరు టాకీస్’ చిత్రంతో మాస్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మధ్యే ‘తను వచ్చేనంట’ పేరుతో ఒక హర్రర్ చిత్రాన్ని చేసిన ఆమె తాజాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు.

ఈటీవీ ప్రభాకర్ మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మీ గౌతమ్ ప్రధాన పాత్ర చేస్తోంది. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యొక్క ఔట్ ఫుట్ చాలా బాగా వస్తొందని, ఇది రష్మీకి మంచి బ్రేక్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో ఆది కథానాయకుడిగా నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు