పూరి జగన్నాధ్ సినిమాలో నటించనున్న రియల్ జంట !

పూరి జగన్నాధ్ సినిమాలో నటించనున్న రియల్ జంట !

Published on Mar 20, 2018 7:00 PM IST

పూరి జగన్నాధ్ తన కుమారుడు ఆకాష్ ను హీరోగా లాంచ్ చేస్తూ మెహబూబా సినిమాను తెరకెక్కించనున్నాడు. 1971 భారత్ – పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సినిమా ఉండనుంది. ‘నేహా శెట్టి’ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు సందీప్ చౌతా స్వరాలు సమకూరుస్తున్నాడు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నటుడు మురళీశర్మ అతని భార్య అశ్విని కల్ శేఖర్ సినిమాలో కూడా భార్య భర్తలుగా నటిస్తున్నారు. హీరోయిన్ కు పేరెంట్స్ పాత్రల్లో వీరిద్దరు కనిపించబోతుండడం విశేషం. సినిమా అవుట్ పుట్ చూసిన కొందరు మూవీ బాగా వచ్చిందని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు