ముందు కమల్ ఆ తర్వాత రజనీ !

ముందు కమల్ ఆ తర్వాత రజనీ !

Published on Apr 19, 2018 10:01 AM IST


తమిళ పరిశ్రమలో జరిగిన నిర్మాతల మండలి నిరసన మూలాన థియేటర్లు మూతబడి అనేక సినిమాలు విడుదలకాలేదు. అలాంటి వాటిలో షూటింగ్, సెన్సార్ పూర్తిచేసుకున్న రజనీకాంత్ ‘కాలా’, కమల్ హాసన్ ‘విశ్వరూపం-2’ కూడ ఉన్నాయి. ప్రస్తుతం బంద్ ముగిసి థియేటర్లలో ఓపెన్ కానుండటంతో ఈ రెండు చిత్రాల్లో ఏది ఎప్పుడు విడుదలవుతుంది అనే కన్ఫ్యూజన్ నెలకొంది అభిమానుల్లో.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు ముందుగా కమల్ హాసన్ యొక్క ‘విశ్వరూపం-2’ మే నెలలో, తరవాత కమల్ యొక్క ‘కాలా’ జూన్ నెలలో విడుదలవుతాయట. ఎందుకంటే ఈ రెండు సినిమాల్లో కమల్ ‘విశ్వరూపం-2’ ముందుగా సెన్సార్ ముగించుకుని విడుదలకు సిద్ధమైంది అందుకే ఆ సినిమాకు ముందుగా విడుదలయ్యే అవకాశాన్ని కల్పించారు. ఇక వీటితో పాటే చిన్న, మీడియం తరహా సినిమాలు కూడ సెన్సార్ పూర్తైన డేట్ ను బట్టి వరుసగా విడుదలకనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు