నైజాంలో ‘ఆఫీసర్’ సినిమాను విడుదలచేయనున్న వర్మ !

నైజాంలో ‘ఆఫీసర్’ సినిమాను విడుదలచేయనున్న వర్మ !

Published on May 22, 2018 4:34 PM IST

నాగార్జున, వర్మల కలయికలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆఫీసర్’. కొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే విడుదలవ్వాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో జూన్ 1కి వాయిదాపడింది. చాలా ఏళ్ల తర్వాత వర్మ, నాగార్జునలు కలిసి చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో, డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

అందుకే ఆంధ్రప్రదేశ్ విడుదల హక్కులు ఫ్యాన్సీ రేటుకి అమ్ముడవగా కలెక్షన్లకు కీలకమైన నైజాం ఏరియా యొక్క విడుదల హక్కుల్ని మాత్రం వర్మ సంస్థ కంపెనీయే ఉంచుకుంది. ఇక ఇతర ఏరియాల రైట్స్ కూడ మంచి ధరలకే అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతో మైరా సరీన్ తెలుగు తెరకు కథానాయకిగా పరిచయంకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు