దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 70% షూట్ పూర్తయిందని.. ఇక ఎన్టీఆర్ సరసన నటిస్తోన్న హీరోయిన్ ను రేపు ప్రకటించనున్నామని చిత్రబృందం ట్వీట్ చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.
జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.
It's been a phenomenal year since the shoot of #RRR began! It was a productive year with 70% of shoot completed.✊????
Also putting an end to speculations, we're glad to announce the lead actress for @tarak9999 & antagonists of the film tomorrow. Stay tuned… #RRR ????????
— RRR Movie (@RRRMovie) November 19, 2019