టాలీవుడ్ లో మొదలైన ‘రుద్రమదేవి’ క్రేజ్

టాలీవుడ్ లో మొదలైన ‘రుద్రమదేవి’ క్రేజ్

Published on Oct 6, 2015 8:46 AM IST

rudramadevi
దాదాపు ఏడాది నుంచి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న భారీ బడ్జెట్ హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’ రిలీజ్ కావడానికి ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. ఇండియాలోనే మొట్ట మొదటిసారిగా స్టీరియో స్కోపిక్ 3డి టెక్నాలజీతో తెరకెక్కిన ఈ కాకతీయ వీరణారి జీవిత కథని అద్భుతంగా ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు డైరెక్టర్ గుణశేఖర్. రిలీజ్ కి మరో మూడు రోజులే ఉండడంతో ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగిపోయింది. సినీ ప్రేమికులతో పాటు, ఇండస్ట్రీలోని వారు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఇలాంటి సినిమాలు మంచి విజయాలను అందుకోవాలని వారు కోరుకుంటున్నారు.

ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ మరియు క్రేజీ ప్రమోషన్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క, గుణశేఖర్, రానా లాంటి వారు ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. గుణశేఖర్ సుమారు 80 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ సినిమాని ఒకేసారి తెలుగు, మలయాళ, హిందీ వెర్షన్స్ లో రిలీజ్ కానుంది, అలాగే ఒకవారం ఆలస్యంగా తమిళంలో కూడా రిలీజ్ కానుంది. అనుష్క రుద్రమదేవిగా, రానా చాళుక్య వీరభద్రుడిగా, అల్లు అర్జున్ గోనగన్నా రెడ్డిగా కనిపించనున్న ఈ సినిమాలో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందినిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందించాడు. భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరో 3 రోజులు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు