ఇంకా గుర్తుంది – ‘మగధీర’ సినిమాపై రాజమౌళి

ఇంకా గుర్తుంది – ‘మగధీర’ సినిమాపై రాజమౌళి

Published on Jul 31, 2014 12:35 PM IST

Magadheera

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘మగధీర’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘మగధీర’లో స్వర్గీయ శ్రీహరి షేర్ ఖాన్ పాత్రలో నటించారు.సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు అత్యుత్తమ నటనను కనబరిచారు. దర్శకధీరుడు రాజమౌళి వెండితెరపై ఆవిష్కరించిన ఈ అద్బుతమైన సోసియో ఫాంటసీ సినిమా విడుదలై నేటితో ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా ‘మగధీర’ విడుదల నాటి సంగతులను గుర్తుచేసుకున్నారు దర్శకుడు రాజమౌళి. సినిమా స్క్రిప్ట్ ఫస్ట్ నేరేషన్ ఇవ్వగానే చిరంజీవి గారు అభినందించారు, శ్రీహరి గారి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సినిమా విడుదలైన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించారు. ఇంకా ఆ మధుర స్మృతులు గుర్తున్నాయి. అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు