దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘సాహో’ !

దుబాయ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘సాహో’ !

Published on May 22, 2018 8:29 AM IST

ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. సుమారు ఒకటిన్నర నెలకు పైగా చిత్ర యూనిట్ దుబాయ్ లోని పలు ఖరీదైన లొకేషన్లలో షూటింగ్ జరిపింది. రూ.90 కోట్ల భారీ బడ్జెట్ ఖర్చు చేసి జరిపిన ఈ షెడ్యూల్ నిన్నటితో పూర్తైంది. ముందస్తు ప్లాన్ ప్రకారమే షెడ్యూల్ విజయవంతంగా జరిగినట్లు తెలుస్తోంది.

ఈ షెడ్యూల్లో హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ సారథ్యంలో ప్రత్యేకంగా ఇంపోర్ట్ చేసుకున్న 37 కార్లు, 5 ట్రక్కులు, ఖరీదైన బైకులను ఉపయోగించి పలు ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇండియన్ సినిమాల్లో ఇదివరకెన్నడూ చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ను ఈ షెడ్యూల్లో రూపొందించారట. షూట్ ముగియడంతో టీమ్ త్వరలోనే ఇండియాకు తిరిగిరానుంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు