‘పిల్లా నువ్వు..’కి డబ్బింగ్ ఫినిష్ చేసిన సాయి ధరమ్ తేజ్

‘పిల్లా నువ్వు..’కి డబ్బింగ్ ఫినిష్ చేసిన సాయి ధరమ్ తేజ్

Published on Oct 23, 2014 11:48 AM IST

Pilla-Nuvvu-Leni-Jeevitham
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన డబ్బింగ్ పార్ట్ ని సాయి ధరమ్ తేజ్ ఫినిష్ చేసాడు. సాయి ధరమ్ తేజ్ నటించిన రెండవ సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. తను చేసిన మొదటి సినిమా ‘రేయ్’ చాలా కాలం క్రితమే పూర్తయినప్పటికీ ఫైనాన్సియల్ ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.

షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ‘పిల్లా నువ్వులేని జీవితం’ ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 25న గ్రాండ్ గా హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఆడియోని విడుదల చేయనున్నారు. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని నవంబర్ 14న ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు – హర్షిత్ కలిసి నిర్మిస్తున్నారు. ఎ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు