రాత్రి వేళల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’

రాత్రి వేళల్లో షూటింగ్ జరుపుకుంటున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’

Published on May 24, 2018 1:32 PM IST

నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. మూడు నెలల గ్యాప్ తర్వాత ఇటీవలే మొదలనిఉంది ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. అది కూడ రాత్రి వేళల్లో కావడం విశేషం. ఈ షెడ్యూల్ లో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయేల్, మురళీ శర్మల ఫై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రమ్యకృష్ణ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. సాధారణంగా మారుతీ తెరకెక్కించే సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగుతూ చిన్న మెసేజ్ కూడా ఉంటుంది. ఈ సినిమా కూడా అదే స్టైల్ లో ఉండనుందని సమాచారం . గోపిసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు