డబ్బింగ్ పూర్తిచేసిన సమంత !

డబ్బింగ్ పూర్తిచేసిన సమంత !

Published on Apr 18, 2018 3:21 PM IST

స్టార్ హీరోయిన్ సమంత ‘మహానటి’ చిత్రంలో జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్ర కోసం సమంత కెరీర్లోనే తొలిసారి డబ్బింగ్ చెప్తున్నారు. తాజాగా ఈ డబ్బింగ్ పనులు ముగిసినట్టు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇటీవలే విడుదలైన టీజర్ సైతం సమంత వాయిస్ ఓవర్ తోనే ఉండటం విశేషం.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో కనిపించనుండగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, మాళవిక నాయర్ వంటి వారు కూడ నటించారు. ఈ మధ్యనే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదలచేయనున్నారు. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు