వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత !

వరుస విజయాలతో దూసుకెళ్తున్న సమంత !

Published on May 21, 2018 6:45 PM IST

సమంత అక్కినేని ఇప్పుడు తెలుగు ,తమిళ్ ఇండస్ర్టీ లో మంచి విజయాలతో దూసుకెళ్తున్నారు . నాగ చైతన్యను వివాహం చేసుకున్న తరువాత విడుదలైన అన్ని సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి . సమంత మ్యారేజ్ తరువాత మొదటగా విడుదలైన చిత్రం ‘రాజు గారి గది 2’ ఈ సినిమా ఓ మోస్తారు విజయం సాధించగా ఆ తరువాత తమిళ్ లో రిలీజ్ అయినా ‘మెర్సల్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. మెర్సల్ తెలుగులో ‘అదిరింది’ పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది . ఇక సమంత నటించిన’రంగ స్థలం’ 2018 లో తన మొదటి సినిమా గా రిలీజ్ అయింది .ఇది ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించ బడుతుంది. ఈ సినిమా తరువాత ఇటీవల రిలీజ్ అయిన’ మహానటి’ తొలిరోజునుండే హిట్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది.ఈ సినిమా తమిళ్ లో ‘నడిగైయర్ తిలగం’ పేరుతో రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధిస్తుంది.

దీని తరువాత విశాల్ తో నటించిన తమిళ చిత్రం’ఇరుంబు తెరై’ కొద్దీ రోజుల క్రితం విడుదలై విశాల్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను సొంతం చేసుకొని సూపర్ హిట్ దిశగా పయనిస్తోంది . ఈ సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు.

ఇలా మ్యారేజ్ తరువాత తను నటించిన అన్ని సినిమాలు విజయవంతం అయ్యి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంతకు మరి రాబోవు సినిమాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. ప్రస్తుతం సమంత తమిళ్ లో సీమ రాజా , సూపర్ డీలక్స్ ,యూ టర్న్ సినిమాలలో నటిస్తున్నారు. యు టర్న్ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు