సంపత్ నంది కొత్త సినిమా ఎంతవరకొచ్చింది?

సంపత్ నంది కొత్త సినిమా ఎంతవరకొచ్చింది?

Published on Dec 11, 2016 5:47 PM IST

sampath-nandi
‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది, చాలాకాలం గ్యాప్ తీసుకొని గోపీచంద్‌తో తన కొత్త సినిమా మొదలుపెట్టిన విషయం తెలిసిందే. బ్యాంకాక్, హైద్రాబాద్‌లలో రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 13నుంచి మరో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనుంది. ఈ షెడ్యూల్‌లో రెండు యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తారట. కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని తెలుపుతూ సంపత్ నంది ఈ విషయం స్పష్టం చేశారు.

ఇదే షెడ్యూల్‌లో హీరోయిన్లు హన్సిక, క్యాథరిన్ థ్రెసాలు ఇద్దరూ పాల్గొంటారని సంపత్ ఈ సందర్భంగా తెలిపారు. సంపత్ గత చిత్రాల స్టైల్లోనే కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందుతోందట. భగవాన్, జె.పుల్లారావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపీచంద్ ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు