యూఎస్ లో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్న మహేష్ మూవీ

యూఎస్ లో మ్యాజిక్ ఫిగర్ ని చేరుకున్న మహేష్ మూవీ

Published on Jan 19, 2020 2:35 PM IST

సరిలేరు నీకెవ్వరు మరో అరుదైన మైలు రాయిని చేరుకుంది . యూఎస్ బాక్సాపీస్ వద్ద $2 మిలియన్ మార్క్ వసూళ్లు దాటివేసింది. విడుదలైన వారం తరువాత సరిలేరు నీకెవ్వరు $ 2 మిలియన్ వసూళ్లను చేరుకొంది. మహేష్ బాబు కెరీర్ లో $ 2 మిలియన్ వసూళ్లు సాధించిన మూడవ చిత్రంగా సరిలేరు నీకెవ్వరు నిలిచింది. గతంలో ఆయన నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలు ఈ ఫీట్ ని సాధించాయి. సరిలేరు నీకెవ్వరు చిత్రంతో యూఎస్ లో మహేష్ తనకు తిరుగు లేదు అని నిరూపించుకున్నాడు.

ఇక తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంటుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటించారు. విజయ శాంతి ఓ కీలక రోల్ చేయడం జరిగింది. దిల్ రాజు, అనిల్ సుంకర , మహేష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు